ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. తన పాలనతో ప్రజలను సంతృప్తి పరచలేని జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ అండ్ కో దౌర్జన్యాలు చూసి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో రాజధానులతో అభివృద్ధి అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. అందుకే, మూడు రాజధానులు, ముప్పై రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే అర్థం తెలియని వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.