telugu navyamedia
రాజకీయ వార్తలు

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పూజలు

chandrababu gift on may day

చంద్రబాబు మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కృష్ణా జిల్లా టీడీపీ పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణప్రసాద్‌ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృత్తివెన్ను శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి వారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. నాగేశ్వరస్వామి సన్నిధికి కృష్ణప్రసాద్‌, శిరీష దంపతులు చేరుకొని, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ కానుమల్లి నాగశ్రీనివాసరావు వారికి స్వాగతం పలికారు. కృష్ణప్రసాద్‌ దంపతులు కొంత సమయం స్వామి సన్నిధిలోనే గడిపారు. ఆయనతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకొని వచ్చే ఎన్నికల ఫలితాల్లో కృష్ణప్రసాద్‌ విజయం సాధించాలని వేడుకున్నారు.

Related posts