telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ కార్మికులకు “త‌ల‌సాని ట్ర‌స్ట్” నుండి నిత్యావ‌స‌ర వ‌స్తువులు

TFI

లాక్‌డౌన్ వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ‌గా నిలిచారు. కృష్ణాన‌గ‌ర్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో 14 వేల మంది సినీ కార్మికులకి (24 సినిమా విభాగాలు) త‌ల‌సాని ట్ర‌స్ట్ నుండి నిత్యావ‌స‌ర వ‌స్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, నాగార్జున‌, రాధాకృష్ణ‌, త్రివిక్ర‌మ్, కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, ఎన్ శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అంతకుముందు త‌ల‌సాని మారేడ్ పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నుండి నిత్యావసర వస్తువులు ఉన్న వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మరియు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్‌లో ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా కూడా సినీ కార్మికుల‌కి నిత్యావ‌స‌రాలు అందిన విష‌యం తెలిసిందే.

Related posts