telugu navyamedia
సినిమా వార్తలు

ముగ్గురు హీరోయిన్స్… ముగ్గురు దర్శకులతో దర్శకేంద్రుడి కొత్త సినిమా

Raghavendra-Rao

నాటి సూప‌ర్‌స్టార్స్ య‌న్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ నుండి నేటి కుర్ర హీరోల వరకూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు తెర‌కెక్కించారు. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. ఆయన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చివ‌రి చిత్రం “నమో వేంక‌టేశాయ‌”. అప్ప‌ట్లో ఇదే రాఘ‌వేంద్రుడి చివ‌రి చిత్రం అనే వార్త‌లు వినిపించాయి. కానీ ఆ వార్తలను ఆయ‌న కొట్టిపారేశారు. ఇప్పుడు నంద‌మూరి తార‌క రామారావు 97వ జ‌యంతి సంద‌ర్భంగా కె.రాఘ‌వేంద్రరావు త‌న సినిమాను అధికారికంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. “నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR” అని ట్వీట్ చేశారు ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. ఈ చిత్రాన్ని బాహుబ‌లి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ముగ్గురు ద‌ర్శ‌కులు, ముగ్గురు హీరోయిన్స్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రి హీరో ఎవ‌ర‌నే విషయాన్ని ప్రస్తావించలేదు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది. షూటింగ్ ఎప్పుడు అనే వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు.

Related posts