స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా… దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆ విషయం ఫస్ట్ లుక్ తోనే అర్థమైపోయింది. కాగా ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రంలోని కీలకమైన ఓ ఫైట్ కోసం పెడుతున్న బడ్జెట్ ప్రస్తుతం మారింది. కరోనా నుంచి తేరుకుని, షూటింగ్ ప్రారంభిన అనంతరం బన్నీతో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్కు తీసేందుకు మూవీ టీమ్ ప్లానింగ్ చేస్తోంది. 6 నిమిషాల నిడివి ఉండే ఈ సీన్ కోసం దాదాపు రూ.6 కోట్ల బడ్జెట్ను నిర్ణయించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొదట దీనిని విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్స్తో తీయాలని భావించినా, కరోనా ప్రభావం వల్ల ఆ నిర్ణయం మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ స్టంట్ కొరియోగ్రఫర్స్తోనే ఈ ఫైట్ను రూపొందించనున్నారు.
previous post