బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా… ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్ అని తెలిపారు బిగ్ బాస్. అయితే బిగ్బాస్ గత ఎపిసోడ్లో రాహుల్ సిప్లిగంజ్ను ‘బ్లాక్ షీప్’ అంటూ శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ పట్ల శ్రీముఖి వర్ణ వివక్ష చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ విమర్శించారు. ఇదే విషయంపై సదరు పత్రిక కథనాన్ని ప్రచురించగా.. శ్రీముఖిపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్రీముఖి ఇమేజ్ డ్యామేజ్ చేసి.. ఆమె ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికే ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపిస్తూ శుష్రుత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ప్రముఖ దినపత్రికపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుని ఆ పత్రిక శ్రీముఖిపై అసత్య ప్రచారానికి పూనుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీముఖి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ పత్రికపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
previous post