telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రావణి కేసులో ఆర్ఎక్స్-100 నిర్మాత అరెస్ట్

Shravani

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి (26) ఆత్మహత్య కేసు ఆమె స్నేహితులు దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి (సాయి) చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ కేసులో ఏ1సాయికృష్ణ, ఏ2 దేవరాజు, ఏ3 నేరస్తుడిగా ఉన్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1గా దేవరాజ్ రెడ్డి, ఏ2గా సాయిరెడ్డి, ఏ3గా నిర్మాత అశోక్ రెడ్డిని రిపోర్ట్ లో చేర్చారు పోలీసులు. ముగ్గురు వ్యక్తుల వేధింపులతో ఒత్తిడికి గురైన నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే దేవరాజ్ రెడ్డి, సాయిరెడ్డి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా గతకొద్దిరోజులుగా పరారీలో ఉన్న అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారించారు. పోలీసుల అదుపులో ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణలను పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే, సోమవారం రోజున విచారణకు వస్తానని చెప్పిన నిర్మాత అశోక్ రెడ్డిమాత్రం పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. పైగా సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు.

Related posts