telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నటికి రైల్వే స్టేషన్ లో వేధింపులు, దాడి

Harshita

హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. అయినప్పటికీ మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. దేశంలో మహిళలపై అకృత్యాలు రానురాను మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక నటిపై పోకిరీ తన ప్రతాపం చూపాడు. సదరు నటి రైల్వే స్టేషన్‌లో ఉండగా ఆ పోకిరీ ఆమెను అశ్లీలంగా తాకాడు. ఆమె వారించడంతో ఆ పోకిరీ ఆమెను కొట్టాడు. ఈ చేదు అనుభవం హిందీ టీవీ నటి హర్షితా కశ్యప్‌కు ఎదురయ్యింది. ఆమె ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన ముంబైలోని చరనీ రోడ్డు రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. షారూఖ్ షేక్ అనే ఒక యువకుడు అతని స్నేహితులు… హర్షితను వెంబడించారు. హర్షిత రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ తీసుకుంటుండగా షారూఖ్ షేక్ ఆమె దగ్గరకు వచ్చాడు. హర్షిత అతనిని ఎందుకు వెంబడిస్తున్నావని అడిగింది. దీంతో అతను ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు ఆ పోకిరీని అదుపులోకి తీసుకున్నారు. కాగా దాడికి గురైన నటి హర్షితా కశ్యప్ ఈ దాడికి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Related posts