telugu navyamedia
రాజకీయ వార్తలు

తీహార్ జైలులో చిదంబరంను కలిసిన సోనియా, మన్మోహన్!

soniya manmohan

కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు ఉదయం తీహార్ జైలుకు వెళ్లారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరాన్ని వారు కలుసుకున్నారు.

తీహార్ జైలు లోనికి వెళ్లిన సోనియా, మన్మోహన్ చిదంబరంతో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారని తెలుస్తోంది. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సోనియా, పార్టీ అండగా నిలుస్తుందని చెప్పినట్టు సమాచారం. కష్టకాలం త్వరలోనే ముగుస్తుందని ధైర్యం చెప్పినట్టు సమాచారం. సోనియా, మన్మోహన్ సింగ్ ల రాకతో తీహార్ జైలు వద్ద సందడి నెలకొంది. దీంతో పోలీసులు అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Related posts