కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్సీ) పదవికి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్ష నేతగా తాను గౌరవించాలని చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించానని తెలిపారు.