కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. అనేక దేశాల్లో కోవిడ్ కోంసాగుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, భారత్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన పాకిస్థాన్ క్రికెట్లో ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ కరోనా బారినపడ్డాడు. అఫ్రిదీకి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.
కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు. గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఒళ్లంతా ఒకటే నొప్పులు. వైద్య పరీక్షలు చేస్తే దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ అని వచ్చింది. త్వరగా కోలుకునేందుకు అల్లా దయ, మీ ఆశీస్సులు కావాలని కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.