telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఇన్ఫోసిస్ ఎఫెక్ట్ ..నష్టపోయిన సెన్సెక్స్!

slight positive trend in stock markets

భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ, సీఎఫ్ఓలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. ఇన్ఫీ షేర్లు కూడా ఈ రోజు కుప్పకూలాయి. దీని ప్రభావంతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 38,963కు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 11,588కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా ఐసీఐసీఐ బ్యాంక్ (3.26%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.22%), సన్ ఫార్మా (1.10%), బజాజ్ (1.04%), యస్ బ్యాంక్ (0.97%) ఉన్నాయి. ఇన్ఫోసిస్ (-16.66%), టాటా మోటార్స్ (-3.84%), భారతి ఎయిర్ టెల్ (-3.24%), హెచ్సీఎల్ (-2.91%), టెక్ మహీంద్రా (-2.31%)లు టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

Related posts