ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంచెకట్టుతో మహాబలిపురానికి చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో మోదీ చర్చలు జరపనున్నారు. శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు మోదీ స్వాగతం పలికారు. తమిళ సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో మోదీ పంచెకట్టుతో కనిపించడం విశేషం.
అచ్చం ఓ తమిళుడిని తలపించేవిధంగా ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు. వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. మహాబలిపురం ప్రాశస్త్యాన్ని జిన్పింగ్కు ప్రధాని మోదీ వివరిస్తున్నారు.