ప్రపంచంలోనే బంగారం అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్ మార్కెట్లో రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా కాస్త తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 తగ్గి రూ.49,860 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,700 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ. 76100 కు చేరింది.
previous post