యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ “గరుడవేగ” సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఫుల్ స్పీడ్ తో ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో “కల్కి” సినిమా చేసాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ప్రస్తుతం రాజశేఖర్ ‘పూలరంగడు, అహ నా పెళ్ళంట వంటి కామెడీ సినిమాలను తెరక్కేకించిన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడున్న కరోనా కారణంగా సినిమా థియేటర్లు అన్ని మూతపడటంతో లాక్ డౌన్ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్కు ప్రేక్షకాదరణ పెరిగిపోయింది. ఈ కారణంగా ఇక ఓటీటీల కోసమే సినిమాలు చేయాలనీ ఈ సీనియర్ హీరో చూస్తున్నట్లు తెలుస్తుంది. ఓటీటీలకు తగిన బడ్జెట్ లో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
previous post
next post
వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు