బాలీవుడ్లో “మిస్టర్ ఇండియా”, “బ్యాండిట్ క్వీన్”, “మాసూమ్” వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని తెరకెక్కించిన శేఖర్ కపూర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకం. ఆయన ఒక సెలెబ్రిటీ అయినప్పటికీ ఎక్కడికైనా వెళ్ళాలంటే రైలులోనో లేదంటే ఆటోలోనో వెళుతుంటారట. ఇటీవల ఓ నెటిజన్కి శేఖర్ కపూర్ ఆటోలో వెళ్ళడం దర్శనమిచ్చింది. తన ట్విట్ ర్ వేదికగా శేఖర్ని డైరెక్ట్గా ప్రశ్నించారు. మీలాంటి సెలబ్రిటీలు ఆటోల్లో ప్రయాణించడం ఆశ్చర్యంగా ఉందని ట్విట్టర్లో అడిగాడు. దీనికి స్పందించిన శేఖర్.. “నేను కారు వాడను. ముంబైలో కారు వాడడం సిల్లీగా అనిపిస్తుంది. ఒక్క కారు తయారు చేసేందుకు ఆరు లక్షల నీరు అవసరమవుతుంది. ఆ నీటిని మనం తినే ఆహారాన్ని పండించుకునేందుకు ఉపయోగిస్తే ఎందరికో జీవానాధారం అవుతుంది కదా” అని శేఖర్ బదులిచ్చారు. ఆయన సమాధానానికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
previous post
next post