telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఫామ్ హౌస్ లో తరుచూ పార్టీలు…!

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాలీవుడ్‌లో తీగ లాగితే టాలీవుడ్ డొంక కదులుతోంది. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు.. దీనిలో భాగంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో లింక్ ఉన్న డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు అవుతోంది. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలతో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్ రాజపుత్ కు లోనవాలా లో ఉన్న ఫామ్ హౌస్ పార్టీలకు అడ్డా అని ఆ ఫామ్ హౌస్ మేనేజర్ రీస్ నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో అధికారుల విచారణలో తెలిపాడు. ఆ ఫామ్ హౌస్ కు తరుచూ రియా చక్రవర్తి, సారా అలీఖాన్ వచ్చేవారని వెల్లడించాడు. పార్టీలలో గంజాయితో పాటూ డ్రింక్స్ తీసుకునేవారని పేర్కొన్నాడు. అంతే కాకుండా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ మిలత్రాతో పాటు పలువురు పార్టీలకు వచ్చేవారని పేర్కొన్నాడు. మొదట సారా అలీఖాన్ సుశాంత్ వచ్చేవారని ఆ తరవాత రియా రావడం మొదలైందని చెప్పాడు. రియా పుట్టినరోజును సైతం ఫామ్ హౌస్ లొనే తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుందని వెల్లడించాడు. పార్టీలలో ఖరీదైన వోడ్కాను ఉపయోగించేవారని తెలిపాడు. అంతేకాకుండా రియా స్మోక్ పేపర్ లను ఆర్డర్ చేసేవారని అవి దేనికోసం వాడేవారో తనకు తెలియదని పేర్కొన్నాడు. తాను ఫామ్ హౌస్ లో 2018 నుండి పని చేస్తున్నానని తెలిపాడు. సుశాంత్ లాక్ డౌన్ సమయంలో ఫామ్ హౌస్లొనే గడపాలని అనుకున్నాడని, కానీ ఎందుకో రాలేకపోయాడని వెల్లడించాడు. దీంతో ఈ ఆధారాలతో అధికారుల విచారణ మరింత వేగవంతం కానుంది.

Related posts