కశ్మీర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. పుల్వామా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు నైకూను హతమార్చాయి. ఈ ఆపరేషన్ ను జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి నిర్వహించాయి. ఈ ఎన్ కౌంటర్ లో నైకూతో పాటు మరో ఉగ్రవాది హతమయ్యాడు. అతన్ని నైకూ అనుచరుడిగా భావిస్తున్నారు.
దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో నిర్వహించిన మూడు ఆపరేషన్లలో ఇదొకటి. పాంపోర్ ప్రాంతంలోని షార్షలీ ప్రాంతంలో నిర్వహించిన మరో ఆపరేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులను కాల్చి చంపారు. నైకూను ఎన్ కౌంటర్ చేసిన ఆపరేషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఆపరేషన్ నేపథ్యంలో కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. నైకూ హతమయ్యాడనే వార్తలతో అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంలో ఈ సేవలను కట్ చేశారు. నైకు తలపై రూ. 12 లక్షల రివార్డు ఉంది.
పోలవరం పై హైకోర్టు తీర్పు జగన్కు చెంపపెట్టు: దేవినేని