telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికలపై టీఎస్‌ ఎస్‌ఈసీ చీఫ్‌ సమావేశం

huge job notification in telanganaf

తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై టీఎస్‌ ఎస్‌ఈసీ చీఫ్‌ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎస్‌ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించి.. 20లోగా నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

నోటిఫికేషన్ వచ్చే వరకు ఓట్ల నమోదుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు 1 కోటి 57 లక్షల ఓటర్లు ఉన్నారని, ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితా అందించామన్నారు. ప్రతి మండలానికి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు బలగాల కోసం మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో చర్చించామని నాగిరెడ్డి తెలిపారు.

Related posts