telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఈ-ఆటో రిక్షాలకు … అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు ..

online applications invited for e-auto

ఈ-ఆటో రిక్షాల కోసం జిల్లా పరిధిలోని అర్హులైన బీసీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా బీసీల అభివృద్ధి శాఖ అధికారి రాజన్న ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండో విడుత ఈ-ఆటో రిక్షాలను అందిస్తున్నదని, ఆటోల మంజూరు కోసం జూలై 25 నుంచి ఆగస్టు 15 లోపు www.brtop.tellangana.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తోన్న ఈ సదావకాశంను సద్వినియోగం చేసుకునేందుకు అర్హుడైన ప్రతి బీసీ యువకుడు ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

అర్హతలు :

– వయస్సు 21 ఏండ్ల నుంచి 40 లోపు ఉండాలి.
– డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబరు, మంజూరైన తేదీ.
– మీసేవా నుంచి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం.
– మీసేవా నుంచి జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం.
– గ్రామీణ ప్రాంతాల వారి కుటుంబ వార్షికాదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారి కుటుంబ ఆదాయం రూ.2లక్షల లోపు ఉండాలి.

Related posts