కేరళ రాష్ట్రంలో ‘ఫణి’ తుపాన్ నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత ఏడాది వరదలతో అతలాకుతలమైన కేరళలో ఫణి తుపాన్ మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని తీరప్రాంతాల్లో కేరళ సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.
ఫణి తుపాన్ వల్ల గంటలకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేరళ సముద్ర తీరంలోని వలియాథుర గ్రామంలో మూడువేల మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఫణి తుపాన్ హెచ్చరికల దృష్ట్యా మత్స్యకారులు మే 1వతేదీ వరకు సముద్రంలోకి వెళ్లవద్దని ప్రసార సాధనాల ద్వార హెచ్చరికలు జారీ చేశారు
జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద..రెగ్యులేటర్ కేసీఆర్ వద్ద: నారా లోకేశ్