జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఐఈడీ పేలుడులో ఓ సైనిక వాహనం ధ్వంసమైంది. జహీద్బాగ్ గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ వాహనం 55 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందినది. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. వాహనానికి స్వల్ప నష్టం జరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి నేపథ్యంలో జమ్మూ-కశ్మీరులో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. షోపియాన్ జిల్లాలోని పండోషాన్ గ్రామం సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది.
‘దీదీ’కి కంటిమీద కునుకు కరువైంది: మోదీ