కరోనా మహమ్మారికి సంబంధించి ట్విటర్ వేదికగా అభిమానులకు పలు సూచనలు చేశాడు స్పిన్నర్ అశ్విన్. బట్టతో తయారు చేసిన మాస్క్లు కాకుండా ఎన్95 మాస్క్లను వాడాలని కోరాడు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. ఈ ట్వీట్పై స్పందించిన ఓ నెటిజన్.. ఎన్95 మాస్క్లు ఖరీదైనవి. వాటిని మేము వాడలేమని కామెంట్ చేశాడు. ‘ఒక ఎన్95 మాస్క్ ధర రూ.70. మాములు సర్జికల్ మాస్క్ రూ.10. వీటిని 8 గంటలకు పైగా వాడలేం. పొట్టకూటి కోసం తిప్పలు పడే పేద ప్రజలు ఇంత ధరలు పెట్టి ఎలా కొనగలరు?’అని ప్రశ్నించాడు. దీనికి అశ్విన్ బదులిస్తూ ‘ఎన్95 మాస్క్ను శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు. వాటిని కొనలేని వారికి నేను ఇవ్వగలను. అవి ప్రజలకు ఎలా చేరాలన్నది నాకు సూచించండి చాలు’అని పేర్కొన్నాడు.మరో నెటిజన్ తనకు రెండో డోస్ టీకా గడువు సమీపిస్తున్నా.. ఎక్కడా వ్యాక్సిన్ లేదని, ఇదే రియల్ ఇండియా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి ప్రతిస్పందించిన అశ్విన్.. మనది అతి ఎక్కువ జనాభా గల దేశం. దయచేసి మీ వంతు వచ్చే వరకు జాగ్రత్తగా వేచి ఉండండని సూచించాడు.
next post
మూఢ నమ్మకాలతో సచివాలయ భవనాలను కుల్చోద్దు: రేవంత్