టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ను గత రాత్రి చంచల్ గూడా జైలుకు తరలించారు. ఆయనను ఓ సాధారణ ఖైదీ మాదిరే పరిగణించిన అధికారులు సింగిల్ బ్యారక్ లో ఉంచారు. గత రాత్రి రవిప్రకాశ్ నిద్రపోలేదని తెలుస్తోంది. ఈ ఉదయం ఆయనకు మిగతా ఖైదీలకు ఇచ్చినట్టుగానే కిచడీని అల్పాహారంగా అందించామని, ఆయన దాన్ని అయిష్టంగానే తీసుకుని సరిగ్గా తినలేదని సమాచారం.
ఆయనకు అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 4412ను కేటాయించామని జైలు సిబ్బంది తెలిపారు. కృష్ణా బ్యారక్ లో ఉంచామని, ఆయన్ను చూసిన ఇతర ఖైదీలు మాట్లాడించాలని ప్రయత్నించినా, మౌనంగా ఉన్నాడని జైలు సిబ్బంది తెలిపారు. నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన రవిప్రకాశ్ కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ను విధించిన అనంతరం, రాత్రి 10 గంటలకు రవిప్రకాశ్ ను జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ