telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫోన్ చేస్తే అర గంటలో బెడ్ అరేంజ్ చేయాలి: సీఎం జగన్

cm jagan ycp

ఆసుపత్రిలో చేరేందుకు ఎవరైనా ఫోన్ చేస్తే అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈరోజు కరోనా వైరస్ సీఎం జగన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి పట్ల వైద్య అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కాల్ సెంటర్ వ్యవస్థను ఎప్పటి కప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ర్యాపిడ్ టెస్టుల్లో 30 నిమిషాల్లో ఫలితం రావాలని చెప్పారు.వారం రోజుల్లో రెగ్యులర్ సిబ్బంది భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. అదనపు సిబ్బంది నియామకాలు కూడా కొన్ని చోట్ల ఇంకా పూర్తికాలేదని, ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

Related posts