telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

జయరాం కేసులో .. రాకేష్ రెడ్డి చెప్పిన విషయాలు..

Chigurupati Jayarammuder case

ఇటీవల హత్యకు గురైన ప్రముఖ వ్యాపారి, చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి కీలక విషయాలు వెల్లడించాడు. జయరాంను చంపిన తర్వాత మృతదేహాన్ని కృష్ణాజిల్లా నందిగామ తీసుకెళ్లినట్లు చెప్పాడు. అనంతరం కారులోనే డెడ్‌బాడీని వదిలేసి బస్సులో హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపాడు.

జయరాం ఇచ్చిన 6లక్షలతో పాటు మరో 4 లక్షలు తీసుకుని గోవా వెళ్లినట్లు స్పష్టం చేశాడు. గోవాలో కాసినో గేమ్ ఆడి రూ.20 లక్షలు సంపాదించిట్లు పేర్కొన్నాడు. మరో ఆటలో ఆ 20లక్షలు పోయాయన్నాడు. 3వ తేదీ ఉదయం గోవా నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చినట్లు వివరించాడు. తనను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాకేష్‌రెడ్డి చెప్పాడు.

Related posts