బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీఢనంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్గాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గత రాత్రంతా వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలోని ప్రధాన మార్గాల్లో నీరు నిలవడంతో ట్రాఫిక్ కు సైతం అంతరాయాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట నిమ్స్, ఎస్సార్ నగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో 2 నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.