ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్లో సింధు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్ ఛాంపియన్షిప్లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరి సత్తాచాటింది. సెమీస్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. సెమీస్లో సింధు 21-7, 21-14 తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యు ఫీను ఓడించింది.
ప్రత్యర్థిని చిత్తుచిత్తుచేసి వరుస గేమ్ల్లో గెలుపొంది తుదిపోరుకు దూసుకెళ్లింది. తొలి గేమ్లో ప్రత్యర్థి పూర్తిగా తేలిపోయింది. సింధు జోరు ముందుకు డ్రాగన్ క్రీడాకారిణి నిలువలేకపోయింది. దీంతో సునాయాసంగా మొదటి గేమ్ను కైవసం చేసుకుని పైచేయి సాధించింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న సింధు అదే ఊపులో రెండో గేమ్ను దక్కించుకుంది. చెన్ చాలా వరకు తప్పిదాలు చేయడంతో సింధుకు కొన్ని పాయింట్లు కలిసొచ్చాయి.