యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాపై అంచనాలను పెంచడం కోసం మేకింగ్ పరంగా యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందులో భాగంగా ఓ స్పెషల్ సాంగ్ను చిత్రీకరించింది. ఈ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రభాస్ కలిసి కాలు కదిపింది. బ్యాడ్ బోయ్ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసి 20 మిలియన్ వ్యూస్ను రాబట్టుకుంది. అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ సాంగ్ చేయడానికి నిర్మాతలు ఆమెకు భారీగానే ముట్ట చెప్పారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల ప్రకారం ఒక సాంగ్ కోసం జాక్వలిన్ రెండు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకుందని టాక్.
previous post
next post