హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రముఖ శివ క్షేత్రం యాగంటిలో జరుపుకుంటుంది. తాజాగా వాల్మీకి ప్రీ రిలీజ్ టీజర్ ని జూన్ 24 సాయంత్రం 5:18ని.లకి విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు చిత్రబృందం. ఈ చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు.
previous post
ఇండస్ట్రీలో 50 శాతం పనికిరాని వాళ్లే… కరోనా వల్ల వాళ్ల శాతం తగ్గుతుంది… డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్