“సాహో” తరువాత ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న ఒకే ఒక్క దక్షిణాది హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ నటించిన `సాహో` సినిమా మిగిలిన అన్ని భాషల్లోనూ పరాజయం పాలైనా.. బాలీవుడ్లో మాత్రం హిట్ అనిపించుకుంది. భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో `ధూమ్-4`లో నటించే అవకాశం ప్రభాస్కు వచ్చినట్టు తెలుస్తోంది. ధూమ్ సిరీస్ సినిమాల్లో హీరో పాత్ర నామమాత్రమే. విలన్దే కీలక పాత్ర. మొదటి సినిమలో జాన్ అబ్రహమ్, రెండో సినిమాలో హృతిక్ రోషన్, మూడో సినిమాలో ఆమిర్ ఖాన్ విలన్ పాత్రల్లో కనిపించారు. మూడు సినిమాల్లోనూ విలన్ను పట్టుకునే హీరో పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించాడు. త్వరలో తెరకెక్కనున్న నాలుగో సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం ప్రభాస్కు వచ్చినట్టు తెలుస్తోంది. మరి, ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
previous post