“బాహుబలి” తరువాత ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు “సాహో” వంటి భారీ చిత్రంలో నటిస్తూనే, మరోవైపు “జిల్” చిత్ర దర్శకుడు రాధాకృష్ణతో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కబోయే లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు ప్రభాస్. యూవీ క్రియేషన్స్లో వంశీ, ప్రమోద్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా 1970ల కాలంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాధాకృష్ణనే ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తయ్యిందని, ఇదొక కాలాతీతమైన ఇద్దరు ప్రేమికుల కథని, 1970ల నాటి కాలంలో యూరప్ నేపథ్యంలో సాగుతుందని వెల్లడించాడు. అంటే ప్రభాస్ 50 సంవత్సరాలు వెనక్కు ప్రయాణం చేయబోతున్నాడన్నమాట. 1970లో యూరప్ మరియు ఇండియాలో జరిగిన ఒక ప్రేమ కథను దర్శకుడు చూపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఎక్కువ భాగం యూరప్లోనే చిత్రీకరించనున్నారు.
Done with the 2nd schedule of #prabhas20 #A classical tale of two timeless lovers set in the twilights of 1970’s Europe. #Prabhas2020
— Radha Krishna Kumar (@director_radhaa) April 1, 2019
హీరోలు, టెక్నిషియన్ లు పారితోషికం తగ్గించుకోవాలంటున్న దర్శకుడు