ప్రముఖులపై పుకార్లు చాలా త్వరగా పుట్టడం, దావానలంలా వ్యాపించడం కూడా జరిగిపోతుంటాయి. అలాంటి పుకార్లకు స్వయంగా ఆయా ప్రముఖులే తెరపైకి వచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అదే తరహాలో ఇటీవల టాలీవుడ్ నటుడు,రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే వాటికి చెక్ పెడుతూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఏమీ కాలేదని ఓ సందేశంలో తెలిపారు.
దీనిపై స్పదించిన ఆయన తన కోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇటివల తాను తీవ్ర అస్వస్థతకు గురైన మాట వాస్తమేనని, చికిత్స తర్వాత ఆరోగ్యం కుదుటపడిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, మరో వారం, పది రోజుల్లో షూటింగ్కి వెళ్లనున్నట్టుగా చెప్పారు పోసాని.
నన్నో క్రిమినల్ లా చూశారు… గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కెనడియన్ ఫిలింమేకర్ ఫైర్