telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రవిప్రకాష్‌ భార్యకు నోటీసులు

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌ సంస్థకు హాని కల్గించే ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులతో కుమ్మకై ఫోర్జరీ పత్రాలను సృష్టించారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంస్థ ప్రయోజనాలకు సంబంధించి రవిప్రకాష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఎక్కడున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నా పోలీసులు ఆయన భార్యకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు.

మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి హీరో శివాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఈ సాయంత్రం పోలీసు అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది.

Related posts