telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

భారత హాకీ జట్టులో కరోనా కలకలం..కెప్టెన్ తో సహా మరో ముగ్గురికి పాజిటివ్

Hocky bats

కరోనా వైరస్ అన్నిరంగాల వారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల అధికారులతోపాటు క్రీడాకారులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా భారత హాకీ జట్టులో కరోనా కలకలం రేగింది. హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ తో పాటు ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ కోసం భారత హాకీ ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు.

కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉన్న ఆటగాళ్లు ఇటీవలే బెంగళూరులోని క్యాంపుకు వచ్చారు. క్యాంపుకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు వీరంతా నిర్బంధంలో ఉన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించగా తొలుత అందరికీ నెగెటివ్ వచ్చింది. శిక్షణ ప్రారంభమైన తర్వాత మళ్లీ టెస్టులు నిర్వహించగా… నలుగురికి పాజిటివ్ వచ్చింది. కెప్టెన్ మన్ ప్రీత్ తో పాటు సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, వరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.

Related posts