telugu navyamedia
సినిమా వార్తలు

నాగార్జునకు మోదీ ట్వీట్… సారాంశం ఏంటంటే…

Nagarjuna-with-Modi

సీనియర్ హీరో, కింగ్ నాగార్జునకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేయడం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ”కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు. అవార్డులు సొంతం చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్న మీరు… ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని కోరుతున్నాను” అంటూ నాగార్జునను ఉద్దేశించి మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కేవలం నాగార్జునకు మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్ , అనుష్క శర్మ, మోహన్ లాల్, అనుష్క, రణవీర్, దీపిక వంటి స్టార్ లకు, పీవీ సింధు, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీ, ధోని తదితర సినీ-రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు కూడా పీఎం ఆఫీస్ నుండి వచ్చిందని సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో సినీ-రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు మోడీ వరుస ట్వీట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Related posts