telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ 21 : షూటింగ్ కు 40 రోజులు కేటాయించిన బిగ్ బి

Amitab

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 21వ మూవీగా విడుదల కానుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసారు. తాజాగా ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. అందులోనూ అమితాబ్ ఇందులో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారట. ఈ విషయం గురించి చిత్ర నిర్మాత అశ్వనీదత్ చెబుతూ “ఇందులో అమితాబ్ గారిది చాలా బలమైన, కీలకమైన పాత్ర. షూటింగుకి ఆయన 40 రోజులు కేటాయించారు. అంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆ పాత్ర ఎంత కీలకమైనదో! జనవరి నుంచి షూటింగ్ మొదలెడతాం. ముందుగా ప్రభాస్, దీపికలు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇక ఏప్రిల్ నుంచి అమితాబ్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతారు. తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలలో కచ్చితంగా ఇదొకటి అవుతుంది” అని చెప్పారు. ‘వైజయంతీ మూవీస్ ని ప్రారంభించింది ఎన్టీఆర్ గారు. అప్పుడు ఆ లెజండ్ తో చేశా.. ఇప్పుడీ లెజండ్ తో చేస్తున్నా’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లు సమాచారం. అతి త్వరలో చిత్రాన్ని సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ భాగం అవుతుండటంతో సినిమాపై ఉన్న అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ ను కూడా ఏకకాలంలో నిర్మిస్తున్నారు.

Related posts