telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వివేకా హత్య కేసు : పిల్ దాఖలు చేస్తున్న .. వివేకా భార్య.. !

YS Vivekananda Reddy's letter accusing Prasad

హైకోర్టు వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన పిటిషన్‌దారును ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలుత ఈ పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో విఫలమైన పిటిషనర్ తరపు న్యాయవాది పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై వాదనలు వినిపించేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది సిద్ధమవుతుండగా జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మధ్యలో కల్పించుకుంది.

వ్యాజ్యం దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హతేంటో చెప్పాలని బెంచ్ ప్రశ్నించింది. తమ క్లయింట్ ప్రజా సమస్యలపై పోరాడతారని, గతేడాది జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై కూడా పిల్ దాఖలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. దీనితో స్పందించిన ధర్మాసనం.. ఆ మాత్రానికే సీబీఐ దర్యాప్తు కోరేంత అర్హత ఉందని అనుకుంటున్నారా? అని ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరి అయిన న్యాయవాది పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరారు. అదే సమయంలో మరో న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా భార్య పిటిషన్ దాఖలు చేయబోతున్నారని, దానిపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు సమ్మతించిన ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Related posts