telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

టీవీ5 ఆఫీసు దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

pawan

హైదరాబాద్‌లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శుక్రవారం రాత్రి టీవీ5 ఆఫీసుపై రాళ్లతో దాడి చేశారని తెలిసి ఎంతో బాధపడ్డానని తెలిపారు.

మీడియా ఆఫీసుపై ఇలాంటి దుష్ట చర్యలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పవన్ ట్వీట్ చేశారు. టీవీ5 చానల్ యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు.

Related posts