పవన్ కల్యాణ్తో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు డాలీ.. దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ దర్శకుడు ఓ మల్టీస్టారర్ కథను రెడీ చేసుకున్నారట. ఈ కథను పవన్- రవితేజ కోసం ఆయన రాసుకున్నారట. ఈ సినిమాకు సంబంధించి ఆ ఇద్దరి హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒప్పుకుంటే.. టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రావడం ఖాయం. కాగా ప్రస్తుతం పవన్ మూడు సినిమాలను ఒప్పుకోగా.. మరోవైపు రవితేజ క్రాక్లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
previous post