కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ అగర్వాల్ రెండోసారి జత కట్టబోతోంది. సోనూసూద్ మరో కీలక పాత్రలో నటించబోతుండగా.. రెజీనా ప్రత్యేక గీతంలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మహేష్ను తీసుకోబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అంతలోనే ఆ పాత్ర కోసం చెర్రీని ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్లో టాక్ నడిచింది. ఈ క్రమంలో ఆ పాత్రకు చెర్రీ ఫిక్స్ అయినట్లు ఖరారు చేశారు మెగాస్టార్ చిరంజీవి. “ఆచార్య”లో కీలక పాత్ర గురించి విన్న తరువాత.. ఆ పాత్రకు చెర్రీనే కరెక్ట్గా సరిపోతాడని తాను, సురేఖ ఇద్దరం భావించామని చిరంజీవి తెలిపారు. ఈ పాత్ర కోసం తాము మహేష్ను సంప్రదించలేదని.. ఈ పుకార్లు ఎలా వచ్చాయో కూడా తమకు అర్థం కాలేదని ఆయన చెప్పారు. ఈ పాత్ర గురించి తాము స్క్రిప్ట్ విన్నప్పటి నుంచే చెర్రీని ఫిక్స్ చేసుకున్నామని తెలిపారు. అయితే చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’లో బిజీగా ఉండటం వలన.. ఈ మూవీకి ఇంకా డేట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం చెర్రీ డేట్లు ఇస్తారో..! లేదో..! కూడా తెలీదని ఆయన అన్నారు. ఈ విషయంలో కొరటాల, రాజమౌళి మాట్లాడుకుంటారని చిరు చెప్పుకొచ్చారు. అలాగే ఈ పాత్ర చిన్నదేం కాదని.. కానీ సినిమాకు చాలా అవసరమైన పాత్ర అని చిరు తెలిపారు. ఇక మహేష్ తనకు తనయుడులాంటోడని.. అతడితో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని చిరు పేర్కొనడం విశేషం. ఇక ఈ సందర్భంగా మూవీ టైటిల్ను రివీల్ చేయడం తన తప్పేనని మెగాస్టార్ ఒప్పుకోవడం గమనార్హం.
previous post
“టీచర్స్ డే”ని విస్కీతో ముడిపెడుతూ… ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు