క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో, క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “కౌసల్య కృష్ణమూర్తి”. ది క్రికెటర్ అనేది టాగ్లైన్. ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. పల్లెటూరిలో రైతులు ఎదుర్కొనే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే యువతి ఆమె కోరికను ఏ విధంగా నెరవేర్చుకుంది అనేది చిత్ర కథాంశం. ఆగస్టు 23న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన “కౌసల్య కృష్ణమూర్తి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన విజయ్ దేవరకొండ అభిమానులకి మంచి మెసేజ్ ఇచ్చాడు. ఈ సాధనర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “2022లో తాగడానికి నీరు కూడా దొరకదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెట్రోల్ని ఎంత పొదుపుగా వాడుతున్నామో నీటిని కూడా అంతే పొదుపుగా వాడుదాం. ప్రభుత్వం నీటిని సమృద్దిగా సరఫరా చేసేందుకు ఎన్నో ప్రణాళికలు రచిస్తుంది. వారికి అండగా మనం నిలుద్దాం . బ్రష్ చేసే సమయంలో ట్యాప్ ఆన్ చేసి ఉంచడం, వాటర్ లీకేజ్లని అరికట్టడం వంటివి చేస్తే మనం నీటిని చాలా వరకు సేఫ్ చేసిన వాళ్లం అవుతాం. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుందాం” అని విజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్కి విజయ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే.
previous post