telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్లాట్‌ఫామ్‌ టికెట్ ధర పెంపు.. ప్రయాణికుల తెలివైన వ్యూహం

special train between vijayawada to gudur

విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ టికెట్ ధర రైల్వే అధికారులు పెంచిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది తెలివిగా ఓ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తమ బంధువులకు దా వీడ్కోలు పలికేందుకు వస్తున్న వారు.. ఫ్లాట్ ఫామ్ టికెట్‌కు బదులు పది రూపాయలు పెట్టి.. గుంటూరు పాసింజర్ టికెట్లు కొంటున్నారు. దీంతో వారికి రూ. 20 ఆదా కావడమే కాకుండా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తోంది. దీంతో ప్లాట్‌ఫామ్ టికెట్ల కన్నా గుంటూరు ప్యాసింజర్ టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.

ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు తాజాగా ప్రయాణికులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండకపోతే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించడానికే ధరలు పెంచామని తెలిపారు. ‘ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు మాత్రమే కొనండి.. గుంటూరు ప్యాసింజరు రైలు టికెట్లు కొనకండి’ అని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Related posts