telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి

naksals encounter

ఛత్తీస్ గఢ్ లోని దంతరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా జిల్లాలోని ఖల్లారి అటవీప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో  మావోయిస్టులు కాల్పులకు పాల్పడడంతో ఎస్టీఎఫ్ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts