ఫ్లిప్ కార్ట్ లో నేటి నుండి నాలుగు రోజులపాటు నోకియా సంస్థ వారి మొబైల్ లకు ప్రత్యేక సేల్ ఏర్పాటు చేశారు. నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ ఈరోజు నుండి 13వ తేదీ వరకు ‘నోకియా డేస్’ పేరుతో ఈ సేల్ ని నిర్వహిస్తోంది. ఈ నాలుగు రోజుల సేల్ లో భాగంగా నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్ తో పాటు అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డులపై 5% డిస్కౌంట్ ని పొందవచ్చు.
ఈ సేల్ లో భాగంగా నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.14,999 ధరకి లభించనుండగా, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.9,999 ధరకి లభించనుంది. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాల్సిన నోకియా మోడల్ ను మీ సొంతం చేసుకోండి.