కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో ధరించడం తప్పనిసరి అని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మాస్క్ విషయమై ఉన్నతాధికారికి కానిస్టేబుల్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సదరు అధికారి కానిస్టేబుల్ను చితక్కొట్టిన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని ప్రేమ్నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుర్గాచౌక్ వద్ద జోగేంద్ర అనే కానిస్టేబుల్తోపాటు మరికొందరు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ ఆనంద్ ప్రకాష్ మాస్క్ ధరించని జోగేంద్రను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఆ సమయంలో ఎస్హెచ్ఓ తనను లాఠీతో తీవ్రంగా కొట్టినట్లు సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు వ్యాఖ్యాతగా దినేష్ కార్తీక్…?