telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మెడికల్ కిట్లతో భారత్ కు బయల్దేరిన చైనా విమానం

discounts in flight tickets to know

ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు కరోనా విజృంభణ చవిచూసిన చైనా తాజాగా భారత్ కు 6.5 లక్షల కరోనా మెడికల్ కిట్లను పంపించింది. వాటిలో రాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్లు, ఆర్ఎన్ఏ ఎక్స్ ట్రాక్షన్ కిట్లు కూడా ఉన్నాయి. ఈ తెల్లవారుజామున చైనాలోని గ్వాంగ్ జౌ విమానాశ్రయం నుంచి మెడికల్ కిట్లతో విమానం భారత్ కు బయల్దేరిందని బీజింగ్ లోని భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. తదుపరి 15 రోజుల్లో మరో 2 లక్షల టెస్టింగ్ కిట్లు చైనా నుంచి భారత్ కు వస్తాయని వివరించారు.

చైనాలో రెండు నెలల లాక్ డౌన్ ముగిసిన తర్వాత కర్మాగారాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాతో పోరాడుతున్న ఇతర దేశాలకు వైద్య సామాగ్రి ఎగుమతి చేయడం ద్వారా నష్టాలను కొంతమేర పూడ్చుకోవాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన వెంటిలేటర్లు, పీపీలు తయారు చేసి ఇతర దేశాలకు పంపిస్తుంది.

Related posts