telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మరోసారి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు: భూమా అఖిలప్రియ

bhuma akhila into ycp soon

వైసీపీ నేతలు మరోసారి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా కర్నూలు జిల్లాలోని అహోబిలం నరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లారంటూ సంబంధిత ఫొటోలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతున్న సమయంలో వైసీపీ నాయకుల కోసం దేవాలయాలు ఎందుకు తెరిచారు? అని ఆమె ప్రశ్నించారు. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డ వైసీపీ నేతలపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ట్విటర్ లో పేర్కొన్నారు. అన్నారు.

Related posts