telugu navyamedia
రాజకీయ వార్తలు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం: మోదీ

modi trump

భారత్–అమెరికా దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఆర్థిక, వాణిజ్య, రక్షణాంశాల్లో రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాధినేతలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–అమెరికా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత మోదీ మాట్లాడుతూ, రక్షణ, భద్రత, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చలు జరిపామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని, 21వ శతాబ్దంలో భారత్–అమెరికా స్నేహం కీలకమని అన్నారు.

Related posts