టీడీపీ నేతల పై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదనన్నారు ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు పొద్దున్న “పోలవరం”, మధ్యాహ్నం “అమరావతి” గురించి భజన చేయడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు గురించి, రాజధాని అమరావతి గురించి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలను తమ ప్రభుత్వం కొనసాగించదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారం చేయడం టీడీపీ కనుక ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ ప్రభుత్వం పని చేయదని, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతోందని మంత్రి స్పష్టం చేశారు.